ఛత్రీ అనబడే స్మారక మంటపాలకి ప్రసిద్ది ఛత్రీ బఘ్. హోల్కా వంశస్తుల స్మృత్యర్ధం నిర్మించబడినవి ఈ స్మారక మంటపాలు. ఖాన్ నది కి సమీపం లో ఛత్రి బాఘ్ ఉంది. ఛత్రి బాఘ్ లో ని సమాధులు డోమ్ ఆకృతి లో ఉండి వాటిపై పిరమిడ్ ఆకృతిలో గోపురాలు కలిగి ఉన్నాయి. ప్రతి ఛత్రీ ఒక రాజు లేదా రాణి యొక్క సమాధిని గుర్తుకు తెస్తాయి.
హోల్కర్ వంశ మూల పురుషుడు అయిన మల్హర్ రావు హోల్కర్ 1 కి సంబంధించిన సమాధి ముఖ్య ఆకర్షణ. రాత్రి పూట పర్యాటకులకి ఈ ప్రదేశం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. రాత్రి పూట విద్యుద్దీపాలతో ఈ ఛత్రీ ల ని అలంకరించడం వల్ల మరియు అక్కడి కృత్రిమ కొలనుల ఫౌంటెన్ ల వల్ల ఈ ప్రాంతం అందంగా మారుతుంది. ఈ కొలను చుట్టుతా అందమైన ఉద్యానవనాలు మాత్రమే కాక ఇక్కడ బోటింగ్ చేసే అవకాశం ఉంది.