దేవగురడియా అనే చిన్న గ్రామం లో ఈ మందిరం ఉంది. ఇండోర్ నగరం నుండి 8 కిలోమీటర్ల దూరం లో ఈ గ్రామం ఉంది. మహా శివుడి కి నిర్మించిన పురాతన ఆలయం ఇది. ఈ పురాతన ఆలయం రాళ్ళతో నిర్మించబడినది . క్రీ . శ 7వ శతాబ్దం లో నిర్మించబడినది ఈ శివాలయం .క్రీ . శ 18 వ శతాబ్దం లో హోల్కర్ రాణి ఆహిల్య బాయ్ చే పునరుద్దరించాబడినది . గరుడ తీర్థ గా ప్రాంతీయులలో ఈ దేవాలయం ప్రసిద్ది . ఇక్కడి నీటి ద్వారం విశిష్టత గో ముఖ రూపం లో రూపొందించబడి ఉండటం . మొట్టమొదటి దేవ్గురడియా శివ దేవాలయం మరియు శివ లింగం భూమిలో కలిసిపోయాక ఇప్పటి దేవాలయం దానిపైన నిర్మించబడినదని చరిత్ర. ప్రతి ఏటా మహా శివరాత్రి కి గొప్ప ఊరేగింపు ఇక్కడ నిర్వహిస్తారు .