ఇండోర్ లో ని ప్రసిద్ది చెందిన ఆధ్యాత్మిక కేంద్రం ఈ ఖజ్రానా గణేశా టెంపుల్. ఈ ఆలయం రాణి ఆహిల్యబాయి హోల్కర్ చేత నిర్మితమైనది. ఈ ఆలయం లో కొలువున్న దైవం వినాయకుడు. భక్తుల లో ఈ ఆలయం అత్యంత సంతరించుకుంది. ఈ ఆలయం లో ప్రార్ధిస్తే కోరికలు తక్షణం తీరుతాయని భక్తుల నమ్మకం. అందువల్ల ఈ ఆలయం లో ఎక్కువ మంది భక్తులు భగవంతుని ఆశీస్సుల ని పొందడానికి కనిపిస్తారు. ప్రతి బుధ మరియు ఆది వారాలలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. వినాయక చతుర్థి అనే పండుగ ఈ ఆలయం లో ఘనం గా నిర్వహిస్తారు. ఈ ఆలయం ప్రసిద్ది చెందిన పర్యాటక ఆకర్షణ కూడా. ఇండోర్ ని సందర్శించే వారు ఈ ఆలయాన్ని తప్పక సందర్శించాలి.