1715 లో ఇస్లాంనగర్ ను కొద్ది కాలం పాటు ఏలిన ఆఫ్ఘన్ సేనాని దోస్త్ మొహమ్మద్ ఖాన్ నిర్మించిన చమన్ మహల్ లేదా ‘ఉద్యానవన భవంతి’ ఆ పేరుకు తగ్గదే. ఇసుకరాతితో నిర్మించిన భవంతి అద్భుత దృశ్యం. ఈ భవంతి ప్రవేశంలో 12 ద్వారాలు వున్న షీష్ మహల్ వుంది. ఈ భవంతి మధ్యలో ఫౌంటెయిన్ల తో కూడిన అందమైన ఉద్యానవనం ఇక్కడి ప్రధాన ఆకర్షణ.
ముఘల్, మాల్వా శైలుల మిశ్రమ శైలికి ఈ భవనం ఒక ఉదాహరణ. ఇక్కడి స్తంభాలు, ఆర్చీలు సూక్ష్మంగా చెక్కిన పూల చిత్రాలతో నిండి వుంటాయి. ఒక అధ్బుతమైన నిర్మాణ సౌందర్యాన్ని చూడడానికి పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిచాలి. ఫౌంటెన్ లలోంచి చిమ్మే సుగంధభరిత జలం లాంటి గత కాలపు విలాసవంతమైన లక్షణాలు లేక పోయినప్పటికీ, ఈ భవంతి ఇప్పటికీ చూసి తీరవలసినదే.