ఇప్పటివరకు ఇటానగర్ నగరం అంతటా పురావస్తు త్రవ్వకాల సంబంధితాల ప్రాంతాలకు ఎక్కువగా ప్రసిద్ధి చెందింది. ఇటా ఫోర్ట్ (బ్రిక్స్ ఫోర్ట్) అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ఆకర్షణీయమైన ప్రదేశాలలో ఒకటిగా ఉంది. ఇటానగర్ కు ఆ పేరు ఇటా ఫోర్ట్ నుండి వచ్చింది.
ఈ కోట నగరం నడిబొడ్డున ఉండటం వల్ల నగరం ఏ మూల నుంచి అయిన సులభంగా చేరవచ్చు. ఈ కోట చరిత్ర 14-15 వ శతాబ్దం నాటిది. ఈ కోట నిర్మాణాలకు ఉపయోగించిన బ్రిక్స్ 16,200 క్యూబిక్ మీటర్ పొడవు కలిగి ఉన్నాయి. కొందరు చరిత్రకారులు మాయాపూర్ రాజు రామచంద్ర యొక్క పాలక కాలంనాటి ఇటుకలు అని చెప్పుతారు. ఈయన జితరి రాజవంశం నకు చెందిన రాజు.
80 లక్షల కంటే ఎక్కువ ఇటుకలను ఈ చారిత్రక కోటను నిర్మించేందుకు ఉపయోగించారు. ఈ కోట ఇప్పటికి కూడా శతాబ్దాలుగా ప్రభువులకు గౌరవం మరియు పూర్తిగా మహోన్నతంగా నిలబడే విధంగా ఉంది. ఇటుకను అహోం భాషలో 'ఇటా' అని పిలుస్తారు. అందువల్ల ఈ కోటకు ఆ పేరు వచ్చింది.
ఈ కోటను పశ్చిమ, తూర్పు మరియు దక్షిణం అనే మూడు వేర్వేరు వైపులా నుండి ప్రవేశించవచ్చు. కోట నుండి పురావస్తు త్రవ్వకాల ద్వారా కనుగొన్న విషయాలు కొన్నింటిని ఇటానగర్ లో ఉన్న జవహర్ లాల్ నెహ్రూ మ్యూజియంలో భద్రపరచబడి ఉన్నాయి.