ఇటార్సిలో కల పెంటే కోస్టల్ చర్చి మన దేశం లోనే కాక విదేశాలలో కూడా ప్రసిద్ధి చెందిన చర్చి గా పెర్కొనబడుతుంది. ఇది ఇండియా లోని పెంతే కోస్టల్ చర్చి లకు ప్రధాన కార్యాలయం. ఈ చర్చి దేశంలో ఇంకా అనేక ప్రదేశాల లో చర్చిలు స్థాపించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇటార్సి చర్చి ని అనుసరిస్తూ ఇప్పటికి సుమారు 1100 చర్చిలు కలవు. ఈ చర్చి కి సంవత్సరం పొడవునా, భక్తులు, యాత్రికులు వస్తూనే వుంటారు. చర్చి నిర్మాణ సౌందర్యానికి ప్రసంసిస్తారు. ఎంతో సుదూర ప్రదేశాల నుండి కూడా వచ్చి ఈ చర్చి ని దర్శించు కుంటారు. ఈ చర్చి కారణంగా ఇటార్సి కి ప్రపంచం లోనే పేరు వచ్చింది.