మధ్యప్రదేశ్ లో జబల్పూర్ లో ఉన్న బాలన్సింగ్ రాక్స్ నిజానికి కేవలం భౌగోళిక అద్భుతం. గండ్ పాలకుడు రాజా మదన్ సింగ్ చేత నిర్మించబడిన మదన్ మహల్ ఫోర్ట్ కి వెళ్ళే దారి లో ఈ ప్రాంతం ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన అగ్ని పర్వత విస్పోటనాల వల్ల ఎగుడు దిగుడు శిలలతో ఏర్పడినది ఈ బాలన్సింగ్ రాక్స్. పడిపోకుండా ఇన్ని సంవత్సరాలు ఈ రాళ్ళు ఎలా నిలదొక్కుకుంటున్నాయో పురాతత్వ శాస్త్రవేత్తలు అలాగే భూగోళ శాస్త్రవేత్తలు అసలైన కారణం కనుగొనలేకపోయారు. జబల్పూర్ లో వచ్చిన భూకంపం కూడా ఈ రాళ్ళను కదపలేదు.
ఈ రాళ్ల బరువు మరియు స్థానం అందుకు కారణం కావచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మదన్ మహల్ ఫోర్ట్ పై నుండి ఈ బాలన్సింగ్ రాక్స్ యొక్క సమగ్ర వీక్షణం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. భూగోళ శాస్త్రజ్ఞులకు ఆశ్చర్యాన్ని కలుగ చేసే ఈ ప్రాంతాన్ని తప్పక సందర్శించి తీరాలి.