జబల్పూర్ లో ని చారిత్రక ప్రాధాన్యం కలిగిన మరొక ప్రాంతం ఈ చౌసాథ్ యోగిని టెంపుల్. జబల్పూర్ లో ని ప్రసిద్ది చెందిన పాలరాతి శిల్పాల వద్ద ఉన్న ఈ ఆలయం లో దుర్గమ్మ వారి 64 మంది పరిచారకుల విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆలయం మధ్యలో ఉన్న శివుడి విగ్రహం చుట్టూ దేవతా విగ్రహాలతో ఈ ఆలయం కే మచ్చుతునక.
క్రీ.శ 1000 లో కలిచురి వంశీకుల చే నిర్మించబడిన ఈ ఆలయం మోఘలులచే దాడి చేయబడినప్పుడు ద్వంసం అయింది. దాడి తరువాత కూడా మిగిలిన శిధిల విగ్రహాలు వాటి యొక్క స్వచ్చతను చిత్రాల యొక్క విశిష్టతను తెలియచేప్తున్నాయి. ఈ ఆలయం లో రాణి దుర్గావతి యొక్క సందర్శన ని పురస్కరించుకుని చెక్కబడిన శాసనాన్ని చూడవచ్చు.
ఇక్క్డడ నుండి గోండ్ క్వీన్ దుర్గావతి పాలసు కి సొరంగ మార్గం ఉంది. జబల్పూర్ సందర్శించేటప్పుడు అణువణువునా అద్భుతంగా ఉండే ఈ విశాల దేవాలయాన్ని తప్పక సందర్శించాలి.