దిగంబర్ జైన్ మతానికి సంబంధించిన ప్రసిద్ద పుణ్యక్షేత్రం ఈ పిసన్హరి కి మడియ. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ మెడికల్ కాలేజ్ కి దగ్గరలో ఉన్న ఈ దేవాలయం 500 ఏళ్ళ నిర్మించబడింది. దీని విశిష్ట నిర్మాణ శైలి అందాల వల్ల జబల్పూర్ లో ని ఎక్కువగా సందర్శించబడే దేవాలయం గా పేరెన్నికగన్నది. జైన సన్యాసి యొక్క పిలుపు విని ఒక పేద వనిత ఈ ఆలయాన్ని నిర్మించిందని ఇతిహాసం.
సన్యాసి యొక్క పవిత్ర వాక్కులు ఆ వనితకి ఇటువంటి నిర్మాణం చెయ్యడానికి తగిన ప్రేరణ కలిగించాయి. ఇప్పటికీ ఇక్కడ కొన్ని రాళ్ళూ ఆ మహిళ చేత పెర్చబడినవి కనిపిస్తాయి. వీటిని ఆ మహిళ యొక్క భక్తి సంకల్పాన్ని తెలియచేయడం కోసం ఇప్పటికీ కదపలేదు. ఆవిడకి నివాళులు అర్పించడం లో భాగంగా ఈ ఆలయానికి పిసన్హరి కి మడియ అంటే "తిరగలి పైన గోధుమ పిండి తయారు చేస్తున్న యువతి" అని అర్ధం. జబల్పూర్ లో ఉన్న ఈ సుందరమైన ప్రాంతాన్ని వందలాది మంది ఏడాది పొడవునా సందర్శిస్తారు.