జబల్పూర్ చరిత్రలో తిల్వారా ఘాట్ ప్రముఖమైన స్థానాన్ని పొందింది. నర్మదా నది ఒడ్డున ఉన్న ఈ తిర్వారా ఘాట్ లో నే మహాత్మా గాంధీ యొక్క అస్థికలు కలిపారు. గాంధీ స్మృత్యర్ధం గాంధీ స్మారాక్ ని కట్టారు. స్వాతంత్ర పోరాట సమయం లో గాంధీగారు జబల్పూర్ ని ఈ ఘాట్ ని మూడు సార్లు సందర్శించారు. ఈ ప్రాంతాన్ని గంగా నది అంత పవిత్రం గా భావిస్తారు. లక్షలాది మంది పర్యాటకులు ఈ ఘాట్ లో పవిత్ర మునక కోసం ఇక్కడికి విచ్చేస్తారు. 1939 లో లోకమాన్య తిలక్ భారీ సంఖ్యలో రాలీ ని నిర్వహించిన ప్రదేశం ఇది. అప్పటి నుండి ఇది తిలక్ భూమి గా ప్రసిద్ది చెందింది. వీటితో పాటు, ఈ ప్రాంతం రాజకీయ రంగానికి చెందిన ఎంతో మంది ధైర్య సాహసములు కలిగిన వ్యక్తులను చూసింది.