దావ్కి, జైతియా హిల్స్ లోని ఒక చిన్న పట్టణం, భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య దాటడానికి ఒక సరిహద్దు కూడా ఉంది. ఇది ఎక్కువగా భారతదేశం నుండి బంగ్లాదేశ్ కు బొగ్గు రవాణాకు ఉపయోగపడుతుంది, మంచి వ్యాపార సమయంలో, ప్రతిరోజూ ఐదువందల కంటే ఎక్కువ ట్రక్కులు ఈ సరిహద్దును దాటతాయి. ఉమ్గోట్ నది ఉన్న దావ్కి చేరిన తరువాత, ఉమ్సీం వద్ద మార్చ్, ఏప్రిల్ మాసాలలో వార్షిక బోట్ రేస్ నిర్వహిస్తారు. ఉమ్గోట్ నది, జయంతియా హిల్స్, ఖాసి హిల్స్ మధ్య సహజ సరిహద్దుగా కూడా ఏర్పడింది. 1932 లో బ్రిటీషు వారు ఈ రెండు జిల్లాలను కలపడానికి ఈ నదిపై భారీ గొలుసు వంతెనను నిర్మించారు.
షిల్లోంగ్ నుండి దావ్కి సరిహద్దు పోస్ట్ కు, బారా బజార్ నుండి షేర్ రవాణా అలాగే పగలు బస్సులు అందుబాటులో ఉంటాయి. ఎంతో సౌకర్యవంతమైన, ఆహ్లాదకరమైన ప్రయాణం కోసం యాత్ర బస్సులు లేదా కాబ్ లను కూడా బుక్ చేసుకోవచ్చు. మరోపక్క, స్యల్హేట్ (బంగ్లాదేశ్)కి బస్సు సేవలను అందించే తమబిల్ బస్ స్టేషన్ కూడా ఉంది.
ఈ పార్క్ నిరంతరం జిల్లా యంత్రాంగ౦ చేపట్టిన ప్రత్యెక DRDA ప్రాజెక్ట్ కింద పునర్నిర్మించబడి, అందంగా ఉంది. లలోంగ్ పార్క్ ని ప్రధాన పర్యాటక కేంద్రంగా మార్చే ప్రయత్నంలో, నీటి పర్యావరణ పార్క్ కూడా నిర్మాణంలో ఉంది. ఈ పార్క్ తోపాటు, ఈ స్థలంలో నీటి ఆనకట్టలు, మరుగుదొడ్లు, కాలువలు, మార్చే గదులు మొదలైన వసతి సౌకర్యాలు కూడా ఉన్నాయి.
మేఘాలయ లోని కొన్ని స్థానిక వివిధ పుష్పాలు ఈ పార్క్ ని అలంకరించాయి. ఇక్కడి గడ్డివాములపై కూర్చుని సూర్యాస్తమయ అందాన్ని ఆనందించవచ్చు. లలోంగ్ పార్క్, మేఘాలయ లోని ఉత్తమ వినోద పార్కులలో ఒకటిగా చెప్పవచ్చు. ఈ ప్రాంతాన్ని నవంబర్, జూన్ నెలల మధ్యలో షిల్లోంగ్ నుండి అద్దె కాబ్ లో చేరుకోవడం ఉత్తమం.