కియంగ్ నొంగ్బాహ్ సమాధి, ఉ కియంగ్ నొంగ్బాహ్ పేరుగల ఒక జయంతియా దేశభక్తుడి గౌరవార్ధం నిర్మించారు, జయంతియా భూమి విముక్తి కోసం బ్రిటీషు పాలకులతో చేసిన యుద్ధంలో అమరావీరుడిగా మరణించాడు.
ఈ చారిత్రక స్మారకం, మదియాహ్ మాయ్ బ్లాయ్ పేరుగాంచిన ఒక విశాలమైన పొలం మధ్యలో నిర్మించారు, ఇది మిండు నది పక్కన ఉన్న సైన్టు సియర్ ఒడ్డున ఉంది. ఈ పొలానికి దాని స్వంత చారిత్రిక గుర్తింపు ఉంది. ఉ కియంగ్ నొంగ్బాహ్ వారి భూమికోసం ఎటువంటి పరిణామాలకు భయపడక, పోరాడి బ్రిటీషు వారిని పారద్రోలి ఆ స్థల బాధ్యతలను తీసుకున్నాడు.
ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు తమ వ్యక్తిగత స్వేచ్చని, భూములను రక్షించడం కోసం తన జీవితాన్ని కోల్పోయిన ఆ స్థానిక నాయకుడికి నివాళులు అర్పించడానికి ఇక్కడికి వస్తారు. జువాయి నుండి లేదా షిల్లోంగ్ నుండి బస్సు లేదా యాత్ర కాబ్ లు బుక్ చేసుకుని కియంగ్ నొంగ్బాహ్ స్మారకాన్ని సందర్శించడం ఉత్తమం.