త్లుమువి రాత్రి వంతెన, జయంతియా రాజు ఆజ్ఞ ప్రకారం ఉ లుహ్ లింగస్కోర్ లమరే, ఉ మర్ ఫలింగ్కి చే స్థాపించబడింది. జయంతియా రాజు సుత్నగా నుండి నర్తియంగ్ కి వేసవి విడిదిని మార్చుకున్నాడని చరిత్ర చెప్తుంది. అందువల్ల, ఆతను తన రాజ్యంలోని సాధారణ రాజధాని జయంతియాపుర్, వేసవి రాజధాని నర్తియంగ్ మధ్య సమాచారాన్ని రాబట్టడానికి, ఈ రెండు ప్రాంతాలకు ఒక వంతెన మార్గం నిర్మించమని ఆయన అనుచరులైన ఉ మర్ ఫలింగ్కి, ఉ లుహ్ లింగస్కోర్ కి ఆదేశించాడు.
తుల్మువి సెలఎరుపై అద్భుతమైన రాతి వంతెనతో వంతెన మార్గం పూర్తయింది. ఈ వంతెన భారీ, పొడవైన రాతి స్తంభాల ఆధారంతో, అపారమైన రాతి దిమ్మేలతో తయారుచేసారు. అనేక సంవత్సరాల తరువాత, ఒక ఏనుగు వ్యాపారి వంతేన పై ఏనుగులను తీసుకువేలుతుండగా ఒక రాతి దిమ్మె విరిగిపడింది. అలా విరిగినప్పటికీ, ఇప్పటికీ ఈ వంతెన చాలా గట్టిగా, పొడవుగా నిలబడి ఉంది.
త్లుమువి సెలయేరు ఒడ్డు పక్కన ప్రవహించే మువి జలపాతం ప్రకృతి లో ఒక అందమైన, అసాధారణ విస్తృత దృశ్యాన్ని ఏర్పరుస్తుంది.