జైపూర్ మధ్యలో ఉన్న సిటీ భవనం పూర్వ సంస్కృతికి చెందిన ఒక ప్రముఖ ప్రాంతం. ఇది నగరంలోని పెద్ద భవనాలలో ఒకటి. ఈ అందమైన భవనాన్ని జైపూర్ రూపకర్త సవాయి జై సింగ్ మహారాజు కట్టించాడు. ఈ భవనం రాజపుత్రుల, మొఘలుల నిర్మాణ శైలుల అందమైన సమ్మేళనం.ఈ సముదాయ ప్రవేశం వద్ద ముబారక్ మహల్ (లేదా స్వాగత భవనం) ఉంది. 19 వ శతాబ్దం లో సవాయి మధో సింగ్ కట్టించిన ఈ భవనాన్ని స్వాగత ప్రాంతం గా ఉపయోగించేవారు. ప్రస్తుతం మ్యూజియంగా మారిన ఈ భవనాన్ని జైపూర్ రాజు రెండో సవాయి మాన్ సింగ్ కు అంకితం చేశారు. ఈ మ్యూజియం లో రాజులు వాడిన అనేక దుస్తుల తో బాటుగా బనారస్ పట్టు చీరలు, పష్మిన శాలువాలు ప్రదర్శనకు ఉంచారు. సవాయి మధో సింగ్ మహారాజు (1750-1768) వాడిన భారీ దుస్తులను కూడా ఇక్కడ చూడ వచ్చు.సిటీ ప్యాలెస్ సముదాయంలో పురాతన రాజపుత్రుల ఆయుధాలను గర్వంగా ప్రదర్శించే మహారాణి భవనం లేదా క్వీన్స్ ప్యాలెస్ ను చూడవచ్చు. ఈ మ్యూజియం లో ఏనుగు దంతపు పిడిగల కత్తులు, గొలుసు కవచాలు, తుపాకులు, చిన్న తుపాకులు, ఫిరంగులు, విషపు కొన వుండే కత్తులు, మందు గుండు సామగ్రి సంచులను చూడవచ్చు. వీనిలో కత్తిరించే బాకు ప్రసిద్ధ ఆయుధం. వీనిలో కొన్ని ఆయుధాలు 15 వ శతాబ్దానికి చెందినవి.సందర్శకుల కోసం ఉదయం 9 నుండి సాయంతం 5 గంటల వరకు తెరిచి ఉంచే సిటీ భవనం ప్రవేశ రుసుము భారతీయులకు రూ.75 విదేశీ పర్యాటకులకు రూ. 300 ఉంటుంది.