జయ్ నివాస్ ఉద్యానవనంలో ఉన్న గోవింద్ దేవ్ జీ ఆలయం శ్రీ కృష్ణుడి కోసం నిర్మించారు. మొదట్లో ఈ దేవుడి విగ్రహాన్ని బృందావనం లోని ఒక గుడిలో ఉంచగా, తరువాత జైపూర్ ని పాలించిన రెండో సవాయ్ జయ్ సింగ్ ఈ విగ్రహాన్ని కులదైవంగా భావించి ఇక్కడ స్థాపించాడు. ప్రతి ఏటా భక్తులను పెద్ద సంఖ్యలో ఆకర్షించే ప్రసిద్ధ క్షేత్రాలలో ఒకటి.