నాహర్ గర్ కోట జైపూర్ రాజు సవాయ్ జయ్ సింగ్ నిర్మించారు. ఈ కోట నిర్మాణం 1734 లో పూర్తిచేయ బడింది, ఇక్కడి ప్రసిద్ధ గోడలు, కోట బురుజులను సవాయ్ మాధో సింగ్ మహారాజు 1880 లో పునర్నిర్మించారు. ఈ కోట, ఆరావళీ పర్వత శ్రేణుల మధ్యలో, శాస్త్రీయ అందమైన సమ్మేళనంతో, యూరోపియన్ శైలితో నిర్మించారు. దీనికి జైపూర్ రాకుమారుడు నాహర్ సింగ్ పేరుపెట్టారు. అతని ఆత్మ కోట నిర్మాణ పనికి అడ్డుపడింది, అతనికి గుర్తుగా కోట ప్రాంగణం లోపల దేవాలయం నిర్మించిన తరువాత ఆత్మ శాంతి౦చిందని నమ్మకం. నాహర్ గర్ అంటే ‘పులుల నివాస స్థలం’ అని అర్ధం. ఈ కోటలో రాజులు, వారి కుటుంబీకులు వేసవి విడిదిగా ఉపయోగించే మాధవేంద్ర భవనం ఉంది. ఇపుడు ఈ ప్రాంతం ప్రసిద్ధ విహార స్థలం. యాత్రీకులు ఈ కోట ప్రాంగణంలో కాఫీ శాలను, రెస్టారెంట్ లను చూడవచ్చు.