అంబర్ కోట లోపల ఉన్న షీష్ మహల్ అద్దాల భవనంగా ప్రసిద్ది చెందింది. జై మందిరం లో భాగమైన ఈ భవనాన్ని అద్దాలతో అందంగా అలంకరించారు.గోడలు, పై కప్పు పై ఉన్న అద్దాల మీద కాంతి కిరణాలు పరావర్తనం చెంది భవనమంతా ప్రకాశవంతమౌతుంది. జైపూర్ మహారాజు రాజా జై సింగ్ 1623 లో తన ముఖ్య అతిథులను కలిసేందుకు దీనిని కట్టించాడు. ఈ భవనం లో వాడిన అద్దాలను బెల్జియం నుండి ప్రత్యేకం గా తెప్పించారు.