జైపూర్ నగరం నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిసోడియా రాణి తోట ప్రసిద్ది చెందినది. దీనిని 1728 లో సవాయ్ జయ్ సింగ్ రాజు తన భార్య సిసోడియా రాణి కోసం నిర్మించాడు. ఫౌంటెన్ లు, మంటపాలు, రంగుల వేదికలు ఉన్న ఈ తోట భారతీయ, మొఘల్ నిర్మాణ శైలి ప్రేరణతో నిర్మించబడింది. సందర్శకులు ఈ తోటలో విగ్రహాలు, అందమైన ప్రేమకదను ప్రదర్శించే రాధాకృష్ణుల చిత్రాలను చూడవచ్చు. ఈ తోట ఇపుడు వివాహాలకి, ఇతర వేడుకలకి వేదికగా మారింది.