15వ శతాబ్దం లో వ్యాస్ కుటుంబం నిర్మించిన అందమైన భవంతి హవేలీ శ్రీనాథ్. అంతకు ముందు ఈ భవనంలో జైసల్మేర్ ప్రధాన మంత్రి నివాసం వుండే వారు. అందమైన చెక్క శిల్పాలు, వాకిళ్ళ పై వుండే ఇనప చట్రాలు ఈ భవంతి అందాన్ని ఇనుమడింప చేస్తాయి. ప్రస్తుతం ఈ భవంతిలోని సగ భాగంలో రాజ కుటుంబీకుల వంశస్తులు ఉంటుండగా మిగతా సగం వారసత్వ హోటల్ గా మార్చారు. జైసల్మేర్ సందర్శించే యాత్రికులు ఇక్కడ రాచరికపు ఆతిద్యం రుచి చూడవచ్చు.