జైసల్మేర్ జానపద మ్యూజియం, గడ్సిసర్ సరస్సు ఒడ్డున ఉంది. ఇది 1984 వ సంవత్సరంలో ఎన్.కె. శర్మ స్థాపించారు. ఈ మ్యూజియం జైసల్మేర్ గొప్ప సంస్కృతి, వైభవాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇక్కడ ప్రదర్శించ బడిన ప్రాచీన కళాకృతుల ద్వారా నగర పరిణామా క్రమాన్ని యాత్రికులు తెలుసుకోవచ్చు. నగలు, చాయాచిత్రాలు, కేశాలంకరణ రీతులు, దుస్తుల సంగ్రహాలను ప్రదర్శించే ఆరు విభాగాలు ఈ మ్యూజియంలో ఉన్నాయి.