జైసల్మేర్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో వున్న ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ మూల్ సాగర్. ఇది సాం ఇసుక తిన్నెలకు వెళ్ళే దారిలో వుంది. ఒక సరస్సుతో పాటు అందమైన తోట కూడా వున్న మూల్ సాగర్ జైసల్మేర్ లోని రాజ కుటుంబీకులకు వేసవి విడిదిగా నిర్మించబడింది. యాత్రికులు ఈ తోట లోపల శివాలయం కూడా చూడవచ్చు.
ఈ గుడిని రెండు పెద్ద ఇసుకరాయి దిమ్మల తో నిర్మించారు. 1815 లో రెండో మహారావాల్ మూల్ రాజ్ మూల్ సాగర్ సముదాయాన్ని నిర్మించాడు. ఈ తోట లోపల చాలా బావులు, ఒక రాజ మహలు, జైన తీర్థంకరుల కోసం నిర్మించిన మూడు జైన దేవాలయాలు యాత్రికులు చూడవచ్చు. ఈ ప్రాసాదాన్ని వివిధ చిత్రాలు, కుడ్య చిత్రాలతో అలంకరించారు. జైసల్మేర్ నుంచి ఆటో లో యాత్రికులు మూల్ సాగర్ చేరుకోవచ్చు.