జైసల్మేర్ లోని మొట్టమొదటి భవంతి అయిన పట్వోన్ కి హవేలీ పాట్వా సముదాయానికి దగ్గరలో ఉంది. 1805 వ సంవత్సరంలో గుమన్ చ౦ద్ పాట్వా తన ఐదుగురు కుమారుల కోసం నిర్మించిన ఈ సముదాయంలో ఐదు భవంతులు ఉన్నాయి. ఈ పసుపు ఇసుకరాయి భవంతి పూర్తిచేయడానికి 50 సంవత్సరాలు పట్టింది. ప్రస్తుతం, ఈ భవంతిలో పురావస్తు శాఖ కార్యాలయం, రాష్ట్ర కళలు, చేతివృత్తుల శాఖ కార్యాలయాలు ఉన్నాయి. పర్యాటకులు జైసల్మేర్ నుంచి ఈ భవంతిని రిక్షాల ద్వారా చేరుకోవచ్చు.