హిందువుల పవిత్ర దేవాలయం వైష్ణో దేవి టెంపుల్ కాతరా లోని త్రికూట హిల్స్ పై సుమారు 1700 అడుగుల ఎత్తున కలదు కాట్ర పట్టణానికి జమ్మూ సుమారు 46 కి.మీ. ల దూరం లో వుంటుంది. ఇది ఒక గుహ దేవాలయం. దీనిలో హిందువుల అమ్మవారు వైష్ణో దేవి వుంటుంది. ఈ గుహ సుమారు 30 మీ. ల పొడవు, 1.5 మీ. ల ఎత్తు వుంటుంది. స్థానికుల కధనం మేరకు ఈ గుహలో అమ్మవారు కొంత కాలం దాగుకొని ఒక రాక్షసుడిని ఆ తర్వాత వధిన్చిందని చెపుతారు.
ఈ క్షేత్ర ప్రధాన ఆకర్షణ అంటే వైష్ణో దేవి యొక్క మూడు రూపాలు. అవి జనన మరణాలు ప్రసాదించే మహాకాళి, జ్ఞానాన్ని ఇచ్చే మహాసరస్వతి, మరియు, ఐశ్వర్యాన్ని, అదృష్టాన్ని ఇచ్చే మహాలక్ష్మి గా చెపుతారు. ఈ గుడి ని శ్రీ మాతా వైష్ణో దేవి దేవాలయ బోర్డు నిర్వహిస్తుంటూ వుంటుంది.
ప్రతి సంవత్సరం, సుమారు 8 మిలియన్ ల భక్తులు దేశ వ్యాప్తంగా వైష్ణో దేవి టెంపుల్ సందర్శిస్తారు. ఆంద్ర ప్రదేశ్ లోని తిరుమల వెంకటేశ్వర టెంపుల్ తర్వాత ఈ గుడి రెండవ అత్యధిక భక్తులు సందర్శించేది గా చెపుతారు. టెంపుల్ చూడాలనుకునేవారు ఈ ప్రదేశానికి కొంత కాలినడక చేయాల్సివుంటుంది