జామ్ నగర్ లో పక్షులకు అనేక ప్రదేశాలు కలవు. వాటిలో ఖిజాదియా సంక్చురి ఒకటి. ఇక్కడ అనేక స్థానిక, వలసపక్షులు వుంటాయి. పర్యావరణ విద్య, పరిశోధనలకు ఇది చక్కని ప్రదేశం. 1920 లో ఇక్కడ రెండు డాములు నిర్మించారు. వాటి లో ఒకటి సముద్రపు నీటికి మరొకటి మంచి నీటికి కట్టారు. వివిధ రకాల పక్షులకు ఈ సంక్చురి ఆశ్రయం గా వుంటుంది. ఎన్నో రకాల వలస పక్షులకు కూడా ఇది ఆశ్రయంగా వుంటుంది. ఈప్రదేశానికి రిక్షాలు లేదా ప్రైవేటు వాహనాలలో వెళ్ళవచ్చు.