ఈ పాలస్ లఖోట సరస్సు మధ్య భాగంలో కలదు. ఈ భవనాన్ని లఖోట టవర్ అంటారు. ఇది ఇపుడు అరుదైన వస్తువుల సేకరణతో ఒక మ్యూజియంగా నిర్వహించబడుతోంది. జాన్ రాన్మాల్జి ఆదేశాలతో ఈ టవర్ ను కరువు నుండి విముక్తికి గాను నిర్మించారు. ఈ కరువు 1834, 1839, 1846 లలో వచ్చినది. మ్యూజియంలో 9వ శతాబ్దం నుండి 18 వ శతాబ్దం వరకూ గల అనేక అరుదైన కళాకృతులు కలవు. మ్యూజియంలో ఒక గార్డ్ రూమ్ కలదు దీనిలో ఆనాటి మిలిటరీ బలాన్ని చూపే కత్తులు,తుపాకులు,పౌడర్ వంటివి కలవు. ఈ మ్యూజియం పర్యాటకులకు ఉదయం 10.30 గం నుండి సా. 5.30 గం. వరకు తెరచి వుంటుంది.