మెరైన్ నేషనల్ పార్క్ ఇండియా లోనే ఒక ప్రత్యేకత కలిగి చూడ దగిన ప్రదేశం. జామ్ నగర్ జిల్లాలో గల్ఫ్ అఫ్ కచ్ ఒడ్డున దక్షిణ దిశగా కలదు. ఇది ఇండియాలో మొదటి మెరైన్ సంక్చురి. 1982 లో స్థాపించిన ఈ పార్క్ ను గుజరాత్ అటవీ శాఖ నిర్వహిస్తుంది. దీనిలో 42 ద్వీపాలు కలవు. ఇవి చాలా అందమైనవి. ఈ నీటి దీవులు అరుదైన, రంగు రంగుల ప్రాణులతో వుండి నీటిలో అందంగా కనపడతాయి. దురదృష్టవశాత్తూ , ఇటీవల ఈ పార్క్ యొక్క జీవ వైవిధ్యం దెబ్బ తింటోంది. ఇక్కడ కల ఆయిల్ రిఫైనరీలు ఇసుక నుండి ఆయిల్ తీయగా, సిమెంట్ కంపెనీలు, మకానిక్ బోటు లు వంటివి నీటి స్వచ్చతను పాడు చేస్తున్నాయి.