ప్రతాప్ విలాస్ పాలస్ ను 1907–1915 ల మధ్య ఎంతో అందంగా జామ్ నగర్ లో యురోపియన్ స్టైల్ లో నిర్మించారు. 1968 లో పర్యావరణ దృక్పధంతో జామ్ సింగ్ ఈ పాలస్ గ్రౌండ్ ను ఒక నేచర్ పార్క్ గా చేసి అనేక ప్రాణులకు ఆశ్రయం ఇచ్చాడు. అయితే రాజ్యాలు రద్దు చేయటం వలన, ఈ పాలస్ మరియు నేచర్ పార్క్ నిర్వహణ కష్టమై దీన స్థితికి దిగజారాయి. పార్క్ లోకి వెళ్ళాలంటే, పర్యాటకులు రాచ కుటుంబ అనుమతి పొందాలి. దీనికి గాను దర్బార్ బాగ్ ఆఫీస్ కి వెళ్ళాలి.