రెండవ ప్రప్రపంచ యుద్ధం లో ఫ్రాన్స్ దేశం లో కల ఈ రకమైన సోలరియా నాశనం చేయబడటంతో ఇక ప్రపంచంలో ఈ ఒక్క సోలరియం లేదా సూర్య రశ్మి గది మాత్రమే మిగిలినది. ఇవి సూర్య రశ్మి తగిలేలా గాజుతో నిర్మిస్తారు. ఈ గాజు గది రోజంతా గుండ్రంగా తిరుగుతూ వుంటుంది. చర్మ వ్యాధులు, కీళ్ళ నొప్పులు, టి.బి. వ్యాధులు కలవారు వీటిలో వుండి చికిత్స తీసుకుంటారు. దీనిని నిర్వహించే వైద్యుడు 1996 లో మరణించటంతో సోలరియం లేదా రంజిత్ ఇన్స్టిట్యూట్ అఫ్ పోలి రేడియో థెరపీ ని మూసి వేసారు.