జైన్ మందిరం ధర్మశాల, జైన యాత్రీకులకు అతిపెద్ద విశ్రాంత మందిరంగా ప్రధానంగా పేరుగాంచింది. జమూయి జిల్లాలోని అతిపెద్ద పర్యాటక ప్రదేశాలలో ఒకటైన క్షత్రియ గ్రామ కుండ్ దారిపై ఉన్న ఈ ప్రదేశాన్ని ఎవరైనా ఎపుడైనా సందర్శించవచ్చు. ఈ విశ్రాంత మందిరం లోపల ఒక పెద్ద మహావీర్ ఆలయం ఉంది. భౌగోళికంగా, ఇది సికంద్ర విభాగంలోని జమూయి జిల్లలో పశ్చిమాన 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ జైన మందిర ధర్మశాల మహాత్వానికి, ప్రశాంతతకు దేశం మొత్తంలో ప్రసిద్ది గాంచింది.