ఛత్తీస్ ఘడ్ లోని ముఖ్యమైన ఆలయాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన అద్భార్ అష్టభుజి, ఎనిమిది చేతుల దేవత, దుర్గాదేవికి చెందిన ఒక పురాతన ధార్మిక స్థలం. ఇక్కడ నవరాత్రి పండుగ దినాలలో వెలిగించే జ్యోతి కలశాలుగా పేరొందిన దీపాలు సందర్శకులు చూడటానికి ఒక అందమైన దృశ్యాన్ని కలగచేస్తాయి.
అద్భార్ ఆలయంలో గొప్ప వాస్తు శైలి ఉంది. ఇది ఒక పద్ధతిలో ఆచారాలను, సంప్రదాయాలను నిర్వహిస్తుంది. అద్భార్ అష్టభుజి ఆలయాన్ని ఛత్తీస్ ఘడ్ లోని అన్ని ప్రధాన ప్రాంతాలనుండి సులువుగా చేరవచ్చు. అందువలన ఈ ప్రాంతానికి భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తారు.