1377 వ సంవత్సరంలో ఢిల్లీ సుల్తాన్ ఫిరోజ్ షా తుఘ్లక్ III ఉన్న సమయంలో పునాది వేసెను. అయితే జౌంపూర్ కు ఈశాన్యంగా 2.2 కిమీ దూరంగా ఉన్న ఆటలా మసీదును 1408 వ సంవత్సరంలో జౌంపూర్ పాలకుడు అయిన సుల్తాన్ ఇబ్రహీం షార్కీ నిర్మించెను.
మొదట ఆటలా దేవికి అంకితం చేసిన ఒక హిందూ మత ఆలయం ఉండేది. దానిని ధ్వంసం చేసి అప్పుడు ఆ ప్రదేశంలో మసీదును నిర్మించారు. మసీదుకు ఆ పేరు దేవాలయం నుండి వచ్చింది.
మసీదు యొక్క నిర్మాణ రూపకల్పన మరియు శైలి, దాని గూళ్లు, దూలాలు, స్తంభాలు మరియు గోడలు మసీదులు, సమాధులు మరియు సుల్తాన్ మహమ్మద్ షా తుగ్లక్ మరియు ఢిల్లీ లో ఫిరోజ్ షా తుగ్లక్ నిర్మించిన ఇతర స్మారకాలకు సారూప్యం కలిగి ఉంటుంది. ఇది బేగంపూర్ మసీదు తో విశేషమైన సారూప్యత కలిగివుంది.
మసీదు విశాలమయిన ప్రార్థనా మందిరంకు దారితీస్తుంది. ఒక అద్భుతమైన వంపు ద్వారా మండపంకు చేరుకోవచ్చు. ఇది వివిధ పరిమాణాలలో ఉన్న మూడు గోపురాలతో పైకప్పు ఉంటుంది. ఆటలా మసీదు జౌంపూర్ ముఖ్య కట్టడాలలో ఒకటిగా ఉన్నది.