జయపూర్ పార్క్, జయపూర్ నడిబొడ్డున అందమైన సరస్సుకు సమీపంలో ఉంది. ఈ సరస్సుని జగన్నాథ్ సాగర్ అని పిలుస్తారు. ఈ పార్క్ జైపూర్ లోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఈ పార్క్ ప్రవేశ రుసుము 5 రూపాయలు.
ప్రజలు బోటు ప్రయాణం ద్వారా ఈ సరస్సు లోని ప్రసాంతమైన నీటి అందాలను ఆస్వాది౦చవచ్చు. సందర్శకులు బొమ్మ రైలు సవారీ ద్వారా పార్కు లోపలి ప్రకృతి అందాన్ని ఆస్వాదించవచ్చు. బోటింగ్, బొమ్మ ట్రైన్ ఈ జైపూర్ పార్కుకి సందర్శకులు విరివిగా రావడం వెనుక ఉన్న కారణం.
చిన్న పిల్లలు ఈ పార్క్ లోపల ఉన్న ఆటస్తలాలలో ఆడుతూ హాయిగా సమయం గడపవచ్చు. అనేకమంది ప్రజలు పగలు, సాయంత్రం వాకింగ్ కి ఈ పార్కుకు రావడం కూడా చూడవచ్చు. స్నేహితులతో, కుటుంబంతో సమయాన్ని గడపడానికి ఈ పార్క్ మంచి ప్రదేశం. ఈ పార్క్ చుట్టుపక్కల ఉండే చాలా పలహారశాలలు దీనిని ఎక్కువగా తిరిగే ప్రాంతంగా మార్చాయి.