మలిగుర లేదా ‘మలిల గ్రామం’ ‘మాలి’ అనే స్థానిక గిరిజనులకు నిలయం. ఇది జయపూర్ నుండి షుమారు 23 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒడిష లోని ఇతర తెగలతో పోలిస్తే వారు చాలా ప్రత్యెక సంస్కృతిని, జీవన విధానాన్ని కలిగి ఉన్నారు. ఈ ‘మాలి’ గిరిజనులు గిరిజన హస్తకళలకు కూడా పేరుగాంచారు.
‘కుండులి’ అనే సమీప గ్రామంలో ఒక వారపు గిరిజన మార్కెట్ నిర్వహించబడుతుంది, ఇది భారతదేశంలోని అతిపెద్ద గిరిజన మార్కెట్ లలో ఒకటి. ఈ ప్రదేశం నుండి ప్రత్యేక హస్తకళల వస్తువులను ఎవరైనా కొనుగోలు చేయవచ్చు. మలిగుర భారతదేశంలోని అతిపెద్ద బ్రాడ్-గేజ్ రైల్వే టన్నెల్ కు చాలా ప్రసిద్ది చెందింది, ఒక కొండను తొలిచి దీనిని నిర్మించారు.
ఈ ప్రాంతంలో కుటీర పరిశ్రమను పైకి తేవడానికి ఒక వెదురు అల్లే పరిశ్రమను అభివృద్ది చేసారు. ఇక్కడి నుండి దాదాపు రెండు మైళ్ళ దూరంలో, ‘కేండుపోడా’ అనే గ్రామంలో ‘బిరుఖోమ్బ్’ అనే అడవి దేవత విగ్రహం ఉంది. ఈ దేవత ఆవహించినపుడు, ఎవర్నైనా చంపవచ్చు లేదా ఏ వ్యక్తినైనా రక్షించవచ్చని చెప్తారు.