భవానీ నాట్యశాల, ఝలావర్ కోటకు దగ్గరలోనే ఉంది. 1921 లో నిర్మించిన ఈ అద్భుతమైన వేదిక కొన్ని మరపురాని నాటకాలు, సాంస్కృతిక సంఘటనలకు సాక్షిగా నిలుస్తుంది. విశిష్టమైన భూగ్రుహ నిర్మాణం ఈ ప్రాంతపు ప్రత్యేకత.
అంతేకాక, వేదికను గుర్రాలూ, రధాలూ కూడా తేలికగా కనబడేలా తక్కువ ఎత్తులో నిర్మించారు. ప్రపంచంలో ఇలాంటి వేదికలు ఎనిమిదే ఉన్నాయని నమ్ముతారు. నాటకరంగం ప్రాచుర్యంలో ఉన్నపుడు ఇక్కడ శాకుంతలం, షేక్ స్పియర్ నాటకాలు ప్రదర్సి౦చ బడ్డాయి. ఈ నాట్యశాల పార్సీ నాటకాలకు కూడా వేదికగా నిలిచింది. కళాసక్తి ఉన్న యాత్రికులు ఈ వేదికను దర్శించి పాతకాలపు వైభవాన్ని నెమరువేసుకోవచ్చు.