1915 లో ప్రభుత్వ మ్యూజియాన్ని స్థాపించారు. అరుదైన చేతివ్రాత ప్రతులు, అందమైన శిల్పాలు, పురాతన నాణాలు, చిత్రాలు ఈ మ్యూజియం ఆకర్షణలు. అంతేకాకుండా, 5,7 వ శతాబ్దాలకి చెందిన పురాతన శాసనాలను కూడా ఇక్కడ చూడవచ్చు. ఈ మ్యూజియంలో శిధిలాల నుండి వెలికితీసిన వివిధ విగ్రహాలు ఉన్నాయి. మాస్కో లో జరిగిన భారత ఉత్సవ వేడుకలలో ఈ మ్యూజియం లో గల అర్ధనారీశ్వర నటరాజ విగ్రహాన్ని ఒకసారి ప్రదర్శించారు. లక్ష్మీ నారాయణ, త్రిమూర్తీ, నటరాజ, విష్ణు, కృష్ణ విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి.