ఝాలారా పటన్, ఝలావర్ నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. నగరం మొత్తానికి గోడ సరిహద్దుగా ఉండటం ఈ వూరి ప్రత్యేకత. ఈ నగరాన్ని మహారాజు విక్రమాదిత్యుడి మనమడు పార్మర చంద్ర సేన్ నిర్మించాడు. ‘సిటీ ఆఫ్ టెంపుల్ బెల్స్’ అని కూడా పిలువబడే ఝాలార పటాన్ చంద్రభాగా నది ఒడ్డున ఉంది.
జేమ్స్ టోడ్ అనే బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారి ఈ ప్రాంతంలో 108 దేవాలయాలు ఉన్నట్లు పేర్కొన్నాడు. 100 అడుగుల ఎత్తులో ఉన్న, 10 వ శతాబ్దం నాటి సూర్య దేవాలయం ఇక్కడి ప్రసిద్ధ ఆలయాలలో ఒకటి. ఇది దాని ఆకర్షణను పెంపొందింప చేసే అందమైన శిల్పాలతో అలంకరించబడి ఉంది.
అంతేకాక, 6 వ 14 వ శతాబ్దంలో నిర్మించిన దేవాలయాల సముదాయాలు ఇక్కడ ఉన్నాయి. 11 వ శతాబ్దంలో ఝాలా జాలిం సింగ్ చె నిర్మించబడిన శ్రీ ద్వారకాదీష్ దేవాలయము, శాంతినాద్ జైన దేవాలయంతో పాటు రెండు ప్రధాన దేవాలయాలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. ద్వారకదీష్ మందిరాన్ని సందర్శించే యాత్రికులు మూలికా వనం, చౌపాటీ కూడా చూడవచ్చు.