ఝలావర్ నగర నడిబొడ్డున ఉన్న ఝలావర్ కోటను ఘర్ పాలెస్ అనికూడా అంటారు. ఈ కోటను 1840-1845 మధ్య మహారాజ రాణా మదన్ సింగ్ నిర్మించాడు. ప్రస్తుతం, కలెక్టరేట్ తో పాటు చాలా ఇతర కార్యాలయాలు ఇక్కడినుండి పనిచేస్తున్నాయి.
మహారాజు వారసులు అందమైన చిత్రాలతో అలంకరించి ఈ భవనం అందాన్ని మరింత పెంపొందించారు. ఇప్పటికీ ఆ గదుల లోపలే ఉన్న ఈ చిత్రాలను చూడాలంటే అధికారుల నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకోవాలి. స్త్రీవాసంగా పిలువబడే జేననా ఖాస్ కూడా అద్దాలు , గోడలపై హడోటీ కళారీతిలోని చిత్రాలతో అలంకరించారు.