వినాయకుడికి అంకితమివ్వబడిన ఆలయం ఇది. 1842 లో రాజా గంగాధర్ తో రాణీ లక్ష్మీ బాయి వివాహం ఈ గణేష్ మందిరం లో నే జరిగింది. మణికర్ణిక అనే పేరు ని లక్ష్మీ బాయి గా మార్చారు.ఝాన్సీ ఫోర్ట్ కి ప్రవేశ మార్గం లో నెలకొని ఉన్న ఈ అందమయిన ఆలయం లో ఈ కోట ని అలాగే నగరాన్ని రక్షించే వినాయకుడి విగ్రహం ఉంది.
ఈ ఆలయ నిర్మాణ ఆకృతి ఇంకా వివిధ లక్షణాలను నిశితం గా పరిశీలిస్తే ఈ ఆలయం కోట తో పాటు నిర్మించబడినదని అర్ధం అవుతుంది. గణేష్ టెంపుల్ తో పటు ఝాన్సీ ఫోర్ట్ స్వాతంత్ర్య సమర పోరాటం కోసం ఝాన్సీ రాణి యొక్క అసమాన పరాక్రమానికి నిదర్శనం గా నిలుస్తాయి.వినాయకుడి భక్తులకి అలాగే పర్యాటకులకి ఈ ప్రాంతం ముఖ్యమైన ఆకర్షణ. ఏడాది పొడవున అధిక సంఖ్యలో ఇక్కడికి ప్రజలు విచ్చేస్తారు.