మహారాజా గంగాధర్ రావు కి ఛత్రీ ఒక స్మ్రుతి చిహ్నం. 1853 లో నవంబర్ 21 వ తేదీన మహారాజా గంగాధర్ రావు యొక్క మరణం తరువాత రాణీ లక్ష్మీ బాయి దీనిని నిర్మించారు. లక్ష్మీ తాల్ లేదా కొలను కి పక్కనే ఉన్న ఈ చ్చాత్రి ఝాన్సీ కి చెందిన చారిత్రక ప్రాముఖ్యం కలిగిన కట్టడాల్లో ఒకటి.
150 ఏళ్ళ క్రితానికి చెందినా కూడా ఇది కాలానికి సంబంధించిన ఎన్నో మార్పులు చూసింది. కళాత్మకం గా చెక్కబడిన 12 స్థంబాలపై ఉన్న మెలితిరిగిన పై కప్పు అప్పటి అద్భుతమైన నిర్మాణ శైలికి ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. భాగోద్వేదం మిళితమైన ఈ ప్రాంతానికి అనేకమంది పర్యాటకులు అలాగే స్థానికులు విచ్చేస్తారు. ఈ ప్రాంతం గొప్ప దేశభక్తిని ప్రేరేపిత పరిచే ప్రాంతం. అంతే కాకుండా, అప్పటి మహా వీరులకి ప్రత్యేకించి ఝాన్సీ కి రాణీ యొక్క సాహసానికి నివాళులు అర్పించే ప్రాంతం.