ఝాన్సీ కి రాణీ గా ప్రసిద్ది చెందిన రాణి లక్ష్మీ బాయి కి చెందిన ప్రదేశం రాణీ మహల్. నవల్కర్ కుటుంబానికి చెందిన రెండవ రఘు నాథ్ చేత ఇది నిర్మించబడింది. 1857 లో ని మొదటి స్వాతంత్ర్య సంగ్రామం లో దేశ భక్తుల దళాలని నడిపించిన రాణీ మరియు మరాఠా వీరులైన తంత్యా తోపే మరియు నానా సాహిబ్ బ్రిటిష్ వారి సైన్యానికి వ్యతిరేకం గా యుద్ధం చేసిన ప్రదేశం ఇదే. రాణీ మహల్ రెండు అంతస్తుల భవనం. నలుచదరపు ప్రాంగణానికి అటు ఇటు కట్టిన సమతలం గా నిర్మించిన ఎదురెదురు పైకప్పులతో ఉంటుంది. ఈ ప్రాంగణానికి ఒకవైపు బావి మరియు ఒక వైపు ఫౌంటైన్ ఉన్నాయి.
ఈ పాలసు లో ప్రఖ్యాత దర్బార్ హాల్ తో కలిపి ఆరు పెద్ద హాలులు ఉన్నాయి. ఈ హాలులు ఒకదానికొకటి సమాంతరంగా నడిచే కారిడార్లతో నిర్మించబడ్డాయి. ఇక్కడ కొన్ని చిన్న గదులు కూడా ఉన్నాయి.దర్బార్ హాల్ యొక్క గోడలపై ప్రకాశవంతమైన రంగుల్లో పెయింటింగ్ చెయ్యబడిన విభిన్న వృక్ష మరియు జంతుజాలం యొక్క చిత్రాలతో అలంకరించారు. బ్రిటిష్ వారిచే ఈ భవనం లో చాలా భాగం నాశనం చెయ్యబడింది. మిగిలిన భాగాన్ని చారిత్రక మ్యూజియం గా మార్చారు.