ఝాన్సీ లో ని సివిల్ లైన్స్ వద్ద ఉన్న ఈ మందిరం కాథలిక్ క్రైస్తవులకు ఏంతో పవిత్రమైనది. సెయింట్ జూడ్ తద్దుస్ యొక్క ఎముక ఈ మందిరం యొక్క పునాదులలో పాతిపెట్టబడిందని నమ్ముతారు. 1966 లో ఈ చర్చ్ లో బిషప్ ఎఫ్ ఎక్ష్ ఫెనేచ్ ఇతర పెద్దలతో కలిసి ప్రార్ధనలు చెయ్యడం ప్రారంభించారు. మిగతా భక్తులు ఆయనని అనుసరించారు. ఇప్పటికీ ఆ సంఖ్యా పెరుగుతూనే ఉంది.
ఈ పవిత్ర స్థలానికి అనేక మంది కాథలిక్ భక్తులు వచ్చి ఈ గొప్ప సెయింట్ కి నివాళులు అర్పిస్తారు. ప్రతి సంవత్సరం 28 అక్టోబర్ న వారం పొడవునా ఉత్సవం నిర్వహిస్తారు. దీనినే సెయింట్ జూడ్ ఫీస్ట్ డే గా పిలుస్తారు. అప్పుడు ఊరేగింపు కూడా నిర్వహిస్తారు. ఈ మందిరం క్రైస్తవ మరియు హిందూ నిర్మాణ శైలిలో నిర్మించబడి ఉంది. క్రైస్తవులే కాక ఇతరులు కూడా ఇక్కడికి అధిక సంఖ్యలో విచ్చేస్తారు.