'కాయ' మరియు 'శోధన' అనే రెండు పదాల కూర్పుతో ఏర్పడిన పదం 'కాయసోధన'. కాయ అంటే శరీరం. శోధన అంటే శుద్దత. ఈ కాయసోధన అనే ప్రక్రియ లో మూడు దశలు ఉంటాయి. మొదటి దశలో నిర్విషీకరణ. యోగా మరియు సహజ సిద్దమైన పద్దతులను ఈ ప్రక్రియలో వాడతారు. ప్రతి వ్యక్తి కొన్ని ప్రత్యేక పద్దతుల ద్వారా శరీరాన్ని శుద్ధపరచుకోవాలి. అయితే కొన్ని పద్దతులు ప్రతి ఒక్కరికీ ఒకే లాగా ఉంటాయి.
రెండవ దశ శరీరం శుద్ధి అయిన తరువాత తిరిగి దానిని ఉత్తేజపరచడం. శరీరం లో ని అన్ని భాగాలు చక్కగా పని చేసేలా చెయ్యటమే ఈ దశ యొక్క ముఖ్య ఉద్దేశం. శరీరానికి పోషకాలు అందించడం మూడవ దశ. రోగి యొక్క శరీరానికి తగినట్టుగా ఆహార నియమాలు తయారుచేస్తారు. పళ్ళు, కూరగాయలు మరియు పళ్ళ రసాలు ఆహారం లో భాగం గా ఉంటాయి.
జింద్ కి ఉత్తరాణ 16 కిలోమీటర్ల దూరం లో కసోహన్ అనే ప్రదేశం లో కాయశోధన అనే ఆలయం ఉంది. పౌరాణిక గాధల ప్రకారం మహా విష్ణువు ఈ ఆలయాన్ని సృష్టించాడని అంటారు.