అమూల్యమైన నల్ల రంగు రాయి అయిన సాలగ్రామం ని కలిగి ఉన్న పుణ్యక్షేత్రం శ్రీ తీర్థ. హిమాలయాల్లోని కొన్ని ప్రాంతాల్లో అలాగే నేపాల్లోని గండకి నదిలో అసలైన సాలగ్రామం రాళ్ళూ దొరుకుతాయి. గోళాకార ఆకారం లో ఉన్నటువంటి రాళ్ళూ అవి. ఈ రాళ్ళని పవిత్రంగా భావించి వీటితోనే దేవుళ్ళ విగ్రహాలు చేస్తారు. భగవాన్ కృష్ణుడు లేదా విష్ణు మూర్తి రాక్షసులని వదించడానికి ఉపయోగించే సుదర్శన చక్రం ని పోలి ఉంటుంది.
సాలగ్రామ రాయిని విష్ణువు కి ప్రతి రూపం గా భావిస్తారు. సాలగ్రామాన్ని పూజించడం వల్ల విష్ణు మూర్తి ఆశీస్సులు లభిస్తాయని తద్వారా భక్తులకి ఆరోగ్యం, సంపద, విజయం అలాగే ఆనందం లభిస్తాయని అంటారు. సాలగ్రామంపై నీళ్ళతో అభిషేకం చేస్తారు. ఆ తరువాత ఆ నీటిని ఒక గిన్నెలోకి తీసుకుని తాగుతారు. ఈ నీళ్ళు పవిత్రమైన అమృతం గా మరి తద్వారా దైవత్వం కలిగి ఉంటాయని అంటారు.
జింద్ జిల్లాలో నర్వానా తెహసిల్ లో శ్రీ తీర్థం సిమ్లా గ్రామంలో ఉంది. ఇది ప్రార్ధనలకు అత్యున్నత ప్రదేశం గా భావించబడుతుంది. ఈ ప్రాంతానికి సమీపం లో ఒక పవిత్రమైన కొలను ఉంది. ఇందులో స్నానాలు చేస్తారు.