క్రీ.శ. 1159 లో బాలక్ రావు పరిహార్ చే నిర్మించబడిన బల్సమండ్ సరస్సు, జోధ్పూర్-మందోర్ రోడ్డు పై ఉంది. గతంలో ఈ సరస్సు మందోర్ నీటి జలాశయంగా ఉండేది. పచ్చటి తోటల మధ్య వుండే ఈ సరస్సు విచిత్రంగా తోడేళ్ళకు, నెమళ్లకు ఆవాసంగా వుంటుంది. బల్సమండ్ లేక్ పాలెస్, సరస్సుకి ఎదురుగా ఉంది.
ఈ భవనం జోధ్పూర్ రాజ కుటుంబాలకు వేసవి విడిదిగా వుండేది. సాంప్రదాయ రాజపుతానా నిర్మాణ శైలిని ప్రదర్శిస్తున్న ఈ పాలెస్ జోధ్పూర్ ప్రసిద్ధ హెరిటేజ్ హోటళ్ళలో ఒకటి.