గుడా బిష్ణాయి గ్రామం, జోధ్పూర్ నగరం నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గిరిజన కుగ్రామం. అందమైన ఖేజ్రీ చెట్లు, గుడా బిష్ణాయి సరస్సు ఈ గ్రామానికి మరింత అందాన్నిచ్చాయి. పర్యాటకులు ఇక్కడ నెమళ్ళు, నల్ల కుందేళ్ళు, జింకలు, చింకారాలు, కొంగలు, వివిధ వలస పక్షులను చూడవచ్చు.
ఇక్కడి గ్రామస్తులు విష్ణుమూర్తి తో పాటు, హరిణాలు, కృష్ణ జింకలను కూడా ఆరాధిస్తారు. జోధ్పూర్ లోని జస్వంత్ సాగర్ డామ్జస్వంత్ సాగర్ డామ్ ను 1892 లో జస్వంత్ సింగ్ మహారాజు నిర్మించాడు. ఇది బిలార, భవి పేర్లుగల రెండు ప్రదేశాల నడుమ ఉన్న పిచియాక్ గ్రామంలో ఉంది. ఈ జలాశయాన్ని ఈ ప్రాంతంలో నీటి సరఫరాకు ఉపయోగిస్తారు.
పర్యాటకులు ఈ సరస్సులో పడవ నడపడం, ఈత కొట్టడం చేయవచ్చు.జోధ్పూర్ లోని ఒస్సియన్ ఒస్సియన్, జోధ్పూర్ నుండి షుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పురాతన నగరం. ఈ స్థలం శతాబ్దాలుగా ఎంతో అందంగా ఉన్న అనేక దేవాలయాలకు ప్రసిద్ది చెందింది. ఈ దేవాలయాల్లో కొన్ని జైన్ ఆలయాలు, సచియా మాత ఆలయం, సూర్య దేవాలయం, హరిహర దేవాలయం, పిప్పాల దేవి ఆలయం, శివ మందిరం, విష్ణు ఆలయాలు అందంగా రూపొందించబడి, నిర్మించబడ్డాయి.
జైన దేవాలయాలు క్రీ.శ. 8వ, 11వ శతాబ్దాలకు చెందినవి. సూర్య (సన్) దేవాలయం, సాచియ దేవాలయాలు వాటి అందానికి పేరుగా౦చాయి. ఈ పట్టణం 8 వ శతాబ్దం నుండి 12 వ శతాబ్దం వరకు గొప్ప వాజిజ్య కేంద్రంగా పనిచేసింది. అయితే, నేడు అది రాజస్థాన్లో ఒయాసిస్ లేదా ఫౌంటెన్ లాగా ఉంది. ఒస్సియన్ నగరం కళాత్మక దేవాలయాలకే కాకుండా ఒంటె సవారీకి కూడా ప్రసిద్ది చెందింది. పర్యాటకులు ఒంటె సవారీ చేస్తూ అక్కడి ఆలయాలను, వాటి నిర్మాణ శైలి వంటి అందమైన దృశ్యాలను ఒకేసారి చూసి ఆనందించవచ్చు.