జోధ్పూర్ నగర౦ నుండి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఒక కొండ మీద ఉన్న జై పోల్, జోధ్పూర్ లోని అద్భుతమైన మేహ్రంగర్ కోట లోని చారిత్రక కట్టడాలలో ఒకటి. ‘విజయానికి ద్వారం’ అని అర్ధం వచ్చే జై పోల్ ఈ బ్రహ్మాండమైన కోట ఏడు ద్వారాల్లో బాగా ప్రసిద్ది చెందింది. అప్పటి మార్వార్ మహారాజు మాన్సింగ్ 1806 లో జై పోల్ ను నిర్మించారు.
ప్రత్యర్ధి రాజ్యాలైన జైపూర్, బికనేర్ లపై మార్వార్ విజయాన్ని జరుపుకొనేందుకు ఈ ద్వారాన్ని నిర్మించారు. యుద్ధ సమయంలో ఫిరంగి గుండ్ల వలన ఏర్పడిన మచ్చలు ఇప్పటికీ గేటు దగ్గరి గోడలపై చూడవచ్చు.