జోధ్పూర్జస్వంత్ తడా, మేహ్రంగర్ కోట ప్రాంగణానికి ఎడమవైపు ఉంది. ఇది జోధ్పూర్ 33 వ రాథోర్ పాలకుడైన రెండవ జస్వంత్ సింగ్ మహారాజు గారి అందమైన పాలరాతి సమాధి. ఈ స్మారకచిహ్నం 19 వ శతాబ్దంలో అతని కుమారుడు సర్దార్ సింగ్ మహారాజు నిర్మించారు. అందమైన పాలరాయి చెక్కుళ్ళ వలన దీనిని ‘మార్వార్ తాజ్ మహల్’ అనికూడా పిలుస్తారు. ప్రధాన స్మారక చిహ్నాన్ని ఆలయ ఆకారంలో నిర్మించారు.