మచియా సఫారి పార్కు, జోధ్పూర్-జైసల్మేర్ దారిలో, జోధ్పూర్ నగరం నుండి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది స్థల సందర్శనకు, విహారయాత్రలకు ప్రసిద్ధిచెందింది. ఈ పార్కు మానిటర్ బల్లులు, అడవి నక్కలు, బ్లూ బుల్స్, ము౦గీసలు, కుందేళ్ళు, అడవి పిల్లులు, కోతులకు సహజ నివాసంగా ఉంది.
అలాగే, పక్షిప్రేమికులు అరుదైన జాతుల వివిధ పక్షులను చూడడానికి కూడా ఇది సరైన ప్రదేశ౦. ఈ పార్కులోఒక కోట కూడా ఉంది, ఇక్కడి నుండి అద్భుతమైన సూర్యాస్తమయ దృశ్యాలను చూసి ఆనందించవచ్చు.