సిద్ధనాధ శివ ఆలయం తఖత్ సాగర్ కొండల మధ్యలో ఉంది. ఈ మందిరానికి వెళ్ళే దారిలో జోధ్పూర్ లోని ఫిల్టర్ హౌస్ కు వెళ్ళే మరో అడ్డ దారి కూడా తగులుతుంది. ఈ మందిరం చేరుకోవడానికి రాతి మెట్లపై నడిచి వెళ్ళాలి. ఈ ప్రాంతం నిర్మానుష్యంగా వుండే రోజుల నాటి నుంచి ఈ ఆలయానికి చరిత్ర వుంది.
పూర్తిగా నిర్మానుష్యంగా వుండే ఈ ప్రాంతంలో పరిసర ప్రాంతాలలో గౌరవాదరాలు కలిగిని వీత్ రాగి నారాయణ్ స్వామీ అనే సాధువు ఒంటరిగా నివసించడం ప్రారంభించారు. తరువాత గౌరీశంకర్ అనే మరొ యోగి కూడా ఈ ప్రాంతానికి వచ్చారు. వికలానుగ్డైన అతని చేతికి నాలుగు వేళ్ళు మాత్రమే ఉండేవి, తరువాత అతను ‘నేపాలీ బాబా’ గా ప్రసిద్ది చెందాడు. అతను స్వంతంగా రాళ్ళను కొట్టి దేవాలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయమే ఇపుడు సిద్ధనాధ శివాలయంగా ప్రసిద్ది చెందింది. ఇతరాలు