ఉదయ్ మందిరం జోధ్పూర్ లోని అత్యంత ప్రసిద్ధ కళాఖండాల్లో ఒకటి. ఇది 102 స్తంభాల ఆధారంతో ఉన్న పెద్ద ఆలయం. ఈ ఆలయ ద్వారం పైభాగాన్ని చెక్కిన ఇసుకరాయితో అలంకరించారు. నాద్ యోగుల బంగారు చిత్రాలు ఈ ఆలయ అందాన్ని మరింత మెరుగుపరిచాయి.
ఈ ఆలయ గర్భ గృహం, ప్రధాన వసారా వస్త్రంతో కప్పబడి ఉంటుంది. పర్యాటకులు ఈ నిర్మాణం చుట్టూ గంధపు చెక్కతో చెక్కిన కంచెను చూసే అద్భుతమైన అవకాశాన్ని పొందుతారు. ఆలయ ప్రధాన ద్వారం కూడా గంధపు చెక్కతో చేసారు.